శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయంలోని హుండీలను శుక్రవారం అక్కమహాదేవి అలంకార మండపంలో లెక్కించారు. పటిష్టమైన నిఘా మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు, భక్తుల సహాయంతో లెక్కించారు. గత 38 రోజుల్లో స్వామి, అమ్మవార్లకు భక్తులు మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.2,62,74,717 ఆదాయం వచ్చిందని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. అలాగే 670 అమెరికా డాలర్లు, పది యూఏఈ దిర్హమ్స్, 151 ఖతార్ రియాల్స్, 10 సింగపూర్ డాలర్లు, 40 కెనడా డాలర్స్, 50 ఆస్ట్రేలియా డాలర్స్, ఐదు ఇంగ్లాండ్ పౌండ్స్, ఒకటి ఎస్ఏయూ రియాల్స్, ఒక మలేషియన్ రింగిట్ తదితర విదేశీ కరెన్సీని భక్తులు హుండీల్లో వేసినట్లు ఆలయ అధికారులు వివరించారు.