Solar eclipse 2025 | ఈ ఏడాది రెండో, చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్లో ఏర్పడనున్నది. సూర్యగ్రహణం కేవలంలో ఖగోళ ఘటన కాగా.. జ్యోతిషశాస్త్రం పరంగా ప్రాధాన్యం ఉంటుంది. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం సూర్యగ్రహణం కాలం శుభకరంగా ఉండదు. అందుకే ఆ సమయంలో తినడం, నిద్రపోవడం, పూజలు చేయడం, ఇతర శుభకార్యాలు చేయరు. ముఖ్యంగా గర్భిణులు ఈ సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.
అయితే, ఈ సూర్యగ్రహణంలో భారత్లో కనిపిస్తుందా? సూతకం ఉంటుందా? గ్రహణ సమయంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు ఇలా అనేక సందేహాలు ఉంటాయి. ఈ ఏడాది చివరి గ్రహణం భారతకాలమానం ప్రకారం సెప్టెంబర్ 21న రాత్రి 11 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 22న ఉదయం 3.24గంటలకు ముగుస్తుంది. సుమారు 4.24గంటల పాటు గ్రహణం కొనసాగుతుంది. అయితే, సూర్యగ్రహణంలో భారత్లో కనిపించదు. దాంతో సూతకం పాటించాల్సిన అవసరం ఉండదు. భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో గ్రహణం ప్రారంభంకానుండడంతో కనిపించేందుకు అవకాశం లేదు. ఈ గ్రహణం ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఫిజీ, న్యూజీలాండ్, అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కనిపిస్తుంది.
గ్రహణ సమయంలో పూజలు, మంత్ర పఠనం, ఇతర ధార్మిక కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే ఈ సమయం శుభసమయం కాదు. సూతకం ప్రారంభమైన వెంటనే ఇంట్లో వంటిన అన్ని ఆహార పదార్థాల్లో తులసి ఆకులు వేసి ఉంచాలి. తద్వారా గ్రహణ దుష్ప్రభావం ఉండదు. ఈ సమయంలో ఇంట్లోని దేవతాచిత్రపటాలు, పూజాసామగ్రి ముట్టడం నిషిద్ధం. గ్రహణ సమయంలో తినడం, నిద్రపోవడం మంచిది కాదు. ఎందుకంటే శక్తులు అసమతుల్యంగా ఉంటాయి. గర్భిణులు గ్రహణ సమయం ఇంట్లోనే ఉండాలి. బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. సీసాలు, కత్తులు, సూదులు వంటి వస్తువులను ఈ సమయంలో వాడకూడదు. ఈ సమయంలో అనవసర పనులు, ప్రయాణాలు, కొత్త పనులు చేపట్టడం వల్ల దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది.
Sravana Masam 2025 | శ్రావణమాసంలో అద్భుత యోగం..! ఈ రాశులకి తిరుగులేని అదృష్టం..!