తిరుమల : శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 21 నుంచి విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మూడు రోజుల పాటు టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ నెల కోటాను 21న మే నెల కోటాను 22న, జూన్ నెల కోటాను 23న విడుదల చేయనున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30వేల టికెట్లు.. సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30వేల టికెట్లు, గురువారం నుంచి ఆదివారం వరకు 25వేల టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నది. అదేవిధంగా సర్వదర్శనం టోకెన్లను రోజుకు 30వేల చొప్పున ఆఫ్లైన్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవింద రాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో భక్తులు కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది.