తిరుమల : వడ్డీకాసులవాడు తిరుమల వేంకటేశ్వరస్వామికి విరాళాల వర్షం కురుస్తుంది. టీటీడీ పరిధిలో నిర్వహిస్తున్న పలు ట్రస్టులకు భక్తులు విరివిగా విరాళాలను ( Donations ) అందజేస్తున్నారు. ఆదివారం కోల్కతాలోని క్రిష్టాన్ ఫ్యామిలీ ట్రస్టు ( Kripton Family Trust ) కు చెందిన ప్రతినిధి పదమ్ కుమార్ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం అందజేశారు.
ఈ మేరకు దాత టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు చేతుల మీదుగా ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు డీడీని అందజేశారు. కాగా ఆదివారం కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం రంగనాయకుల మండపంలో తీర్థ,ప్రసాదాలు అందజేశారు.