తిరుమల : హైదరాబాద్ ( Hyderabad Devotee )కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ ( Tirumala Devotee ) అనే భక్తుడు సోమవారం టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు హైదరాబాద్ లోని కార్యాలయంలో విరాళం డీడీని దాత అందజేశారు.ఈ కార్యక్రమంలో దాత తండ్రి రిటైర్డ్ ఇంజినీర్ బి. జగదీశ్వర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తిరుమలలో స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం
వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం స్వామివారిని 93,230 మంది భక్తులు దర్శించుకోగా 41,754 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.83 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 నుంచి 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.