హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. అయితే హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. ఇంత ప్రత్యేకత ఉన్న తొలి ఏకాదశి రోజున వ్రతం చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున ఆవులను పూజించాలి.. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది.. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే.. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఆ రాత్రంతా జాగరణ చేయాలి.. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.
వ్రత విధానం : ఉపవాసం ముఖ్యోద్దేశ్యం ‘ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడి ప్రసన్నతయే’. ఈ తిథినాడు మరింత భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుని ఆరాధనలో నిమగ్నం కావాలి. ఏ విధమైన తృణధాన్యాలనూ తినకూడదు. వీలైతే ఆహారాన్ని పూర్తిగా త్యజించాలి. ఉపవాసాన్ని ఆచరింపలేని వృద్ధులు తదితరులు పండ్లు, పాలు మొదలైన వాటిని మితంగా స్వీకరించవచ్చు.