అమరావతి : కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో స్వర్ణ రథాన్ని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద ప్రారంభించారు. ఆలయంలో ఉత్సవాల సమయంలో వినియోగించేందుకు స్వర్ణ రథాన్ని తయారు చేయించారు. కలశ పూజ, హోమం, పూర్ణాహుతితో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా స్వర్ణ రథాన్ని ప్రారంభించారు. నూతన స్వర్ణ రథంపై సిద్ధి, బుద్ధి సమేత వినాయకుడిని ప్రతిష్టించి, మాడవీధుల్లో ఊరేగించారు.
స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న అనంతరం.. స్వామివారికి ఏర్పాటు చేసిన స్వర్ణరథం శిలాఫలకాన్ని ఆవిష్కరించి.. స్వర్ణ రథాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి స్వరూపానంద స్వామి ప్రారంభించారు. ఆలయానికి బంగారు రథం సమకూరడం సంతోషంగా ఉందని స్వరూపానంద స్వామి చెప్పారు. ఈ స్వర్ణరథాన్ని 25 కిలోల బంగారాన్ని వినియోగించి, సుమారు 6.50 కోట్ల తయారు చేయించారు.