తిరుమల :తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో నాలుగు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 65,278 మంది భక్తులు దర్శించుకోగా 22,077 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారికి రూ. 3.70 కోట్లు ఆదాయం (Hundi Income) వచ్చిందని వివరించారు.