మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్యే దివాకర్రావు
మంచిర్యాలలో 30 మంది లబ్ధిదారులకు రెండు పడకల ఇండ్లు అందజేత
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 7: ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లలో సగర్వంగా జీవించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో 30 మందికి బుధవారం కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు అందించారు. అనంతరం పలువురు లబ్ధిదారుల ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా మంచిర్యాలలో పేదలకు డబుల్ బెడ్రూంలు అందజేస్తున్నామని, ఆత్మగౌరవ ప్రతీకలుగా భావించాలని సూచించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన ప్రాంతా ల్లో అవసరమైన మేరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, దశల వారీగా అభివృద్ధ్ది చేస్తామని పేర్కొన్నారు.
ఎ మ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. రాజీవ్నగర్లో వందల ఎకరాల స్థలాన్ని తాను కాపాడానని, దాని ఫలితంగానే ఈరోజున వేలాది మంది పేద ప్రజలకు నివాసాలు, స్థలాలు అందించగలుగుతున్నామని పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణంలో 650 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తికావచ్చిందని, ఇంకా 620 మందికి త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇండ్లు కేటాయించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, కౌన్సిలర్ బుద్దార్థి సత్తమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, ఇన్చార్జి ఆర్డీవో శ్యామలాదేవి, తహసీల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మా ఆయన విడుదలకు చర్యలు తీసుకోండి : జవాన్ రాకేశ్వర్ భార్య