TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. క్యూలైన్ తిరుమల గోగర్భం జలాశయం వరకు సర్వదర్శనం క్యూలైన్ ఉండగా.. వెంకన్న దర్శనానికి 48 గంటలకుపైగా సమయం పడుతున్నది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 21 వరకు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. వరుస సెలవుల దృష్ట్యా 20 వరకు రద్దీ ఉంటుందని భావిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చైర్మన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి, సహకరించాలని కోరారు.