శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. దీంతోపాటు భక్తులకు మల్లికార్జునస్వామి సర్వదర్శనం కూడా మొదలయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి అధికారులు ఆర్జిత సేవలు, సర్వదర్శనం భాగ్యం కల్పిస్తున్నారు. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరెంట్, ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 6 నుంచి రోజుకు మూడుసార్లు సామూహిక అభిషేకాలు
నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, అక్కమహాదేవి అలంకార మండపంలో నేడు హుండి లెక్కింపు జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి సామూహిక అభిషేకాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్జిత, పరోక్షసేవ, బ్రేక్ దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.