తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు (Tirumala) చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు ఉన్న భక్తులకు నేరుగా దర్శనం (Darsan) అవుతుండగా టికెట్లు లేని భక్తులకు 7 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 62,566 మంది భక్తులు దర్శించుకోగా 16,021 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.20 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.