అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం తీసుకుంటుంది. 29 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచిఉన్నారు. నిన్న 75,324 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
35, 086వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5. 03 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.