తిరుమల : వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala )కు భక్తుల తాకిడి కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం 31 కంపార్టుమెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్హౌజ్ ( Krishna Teja Guest house ) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
బుధవారం స్వామివారిని 89,403 మంది భక్తులు దర్శించుకోగా 49,958 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.99 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అదేవిధంగా 4.22 లక్షల లడ్డూలను విక్రయించామని, 3,603 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని వివరించారు.