డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో గత ఫిబ్రవరిలో సంభవించిన హిమపాతం తాలూకూ విషాదాన్ని పూర్తిగా మరిచిపోకముందే మరో హిమపాతం కలకలం రేపుతున్నది. భారత్-చైనా సరిహద్దుల్లోని చమోలీ జిల్లాలోనే మరోసారి భారీ హిమపాతం సంభవించింది. చమోలీ జిల్లా నీతి వ్యాలీలోని సుమ్నా గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతిచెందారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంచు కరిగడంతో భారీగా మంచు పెల్లలు విరిగిపడి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే చమోలీ జిల్లా అధికార యంత్రాంగం, ఆర్మీ అధికారులు, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. హిమపాతంలో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కాగా, ఇప్పటివరకు మొత్తం 384 మందిని హిమపాతం నుంచి రక్షించినట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో 8 మృతదేహాలను ఘటనా ప్రాంతం నుంచి వెలికి తీశామని చెప్పారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరో మూడు నాలుగు గంటల సమయం పట్టవచ్చునని అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..