ముంబై: హాలీవుడ్కు చెందిన యువ నటుడు కార్తీక్ ఆర్యన్కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆర్యన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరాడు. కార్తీక్ ఆర్యన్ గత శనివారం లాక్మీ ఫ్యాషన్ వీక్లో ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా కోసం ర్యాంప్ వాక్ చేశాడు. తన తుదుపరి చిత్రం భూల్ భులైయా 2లో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీతో కలిసి లాక్మీ ఫ్యాషన్ వీక్లో పాల్గొన్నాడు.
కార్తీక్ ఆర్యన్ ఈ నెల 15న కియారా అద్వానీ, టబుతో కలిసి భూల్ భులైయా 2 షూటింగ్లో పాల్గొన్నాడు. కాగా, ముంబైలో ఆదివారం మొత్తం 3,779 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ముంబైలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,62,675కు చేరింది. మృతుల సంఖ్య 11,586కు పెరిగింది.