మంచిర్యాల : చెన్నూరు సమీపంలోని సుద్దాల వద్ద ఆటో, ద్విచక్రవాహనం ఢీకొట్టున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయపడ్డారని సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన బానాల విజయ కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి.. తిరిగి ఇంటికి ఆటోలో బయలుదేరారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో చెన్నూరు శివారులోని సుద్దాల ఎక్స్రోడ్.. ఎన్హెచ్63 హైవే వద్దకు రాగా.. సుద్దాల నుంచి వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ద్విచక్ర వాహనంపై ఆటోను ఢీకొట్టాడు.
దీంతో ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ఉన్న బానాల రాజమణి (18) యువతి తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది. ఆటో డ్రైవర్ నరేశ్తో పాటు అతని భార్య శిరీష, కుమారుడు రిషికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం డ్రైవర్ దుర్గం కిరణ్ సైతం తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చెన్నూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.