చాంద్రాయణగుట్ట : ఓ యువతి అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం..బండ్లగూడ జహాంగీరాబాద్కు చెందిన సానా బేగం (20) ఈ నెల 5న కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.