ఖమ్మం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడలో ఓ యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. గత నెల 31న ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. అత్యాచా రానికి పాల్పడిన యువకుడితోపాటు, మాజీ ప్రజాప్రతినిధి కుటుంబంతో తనకు ప్రాణహాని ఉందని,వారిపై చర్యలు తీసుకొని తనకు నాయ్యం చేయాలని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.
దీంతో ఆ యువతిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన సమయంలో యువకుడికి ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారులు సహకరించి, తనను చిత్ర హింసలకు గురిచేశారని బాధిత యువతి ఆరోపించింది.