వెల్దుర్తి/మెదక్ : ట్రాక్టర్ బైక్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వెల్దుర్తి మండలం మండలం ఆరెగూడెం గ్రామ శివారు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..మండలంలోని మన్నెవారి జలాల్పూర్ గ్రామానికి చెందిన నాగని కుమార్(26) బైక్పై జలాల్పూర్ నుంచి వెల్దుర్తికి వస్తుండగా..పంతులపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఎదురెదురుగా వచ్చి బైక్ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కుమార్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ట్రైనీ ఎస్సై హరీష్ ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని మెదక్ ఏరియా దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.