రంగారెడ్డి : యువకుడి వేధింపులు తాళలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పుప్పాలగూడలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పుప్పాగూడలో ఒంటరిగా ఉండే ఓ వివాహితను స్థానికంగా ఉండే ఉన్యానాయక్ అనే యువకుడు వేధించినట్లు ఆరోపణలున్నాయి. యువకుడు వేధింపు వల్లే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతికి కారణమైన ఉన్యా నాయక్ను కఠినంగా శిక్షించాలని ఆమె తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.