ఎర్రుపాలెం:ఎర్రుపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బండి రాజేష్(26) అనే యువకుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బండి రవి, అతని కుమారుడు బండి రాజేష్లు ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్తుండగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మైలవరంలో విజయవాడ- భధ్రాచలం హైవేపై మైలవరం లక్కిరెడ్డి బాలరెడ్డి కళాశాల సమీపంలో ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు వారిద్దరినీ మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటుండగా రాజేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతని తండ్రి బండి రవికి తలకు బలమైన గాయాలు కాగా ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. బండి రాజేష్ మృతితో బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.