మెహిదీపట్నం : ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ ఎంట్రన్స్ కోసం సిద్ధం అవుతున్న ఓ యువ డాక్టర్ తరగతులకు వెళ్లి వస్తూ టిప్పర్ ఢీ కొనడంతో మృతి చెందాడు. హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ కె.నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన సిహెచ్.రాంగోపాల్ తన కుటుంబంతో నగరానికి వచ్చి 12 ఏండ్ల నుంచి కార్వాన్ విశ్వేశ్వర్నగర్ శ్రీకృష్ణభవన్ వెనక ఉన్న ఉమ రెసిడెన్సీ అపార్టుమెంట్లో నివసిస్తున్నాడు. అతడి ఒక్కగానొక్క కొడుకు సిహెచ్.విశ్వ కళ్యాణ్ (24) ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్గా పనిచేస్తున్నాడు.
మరోవైపు పీజీ ఎంట్రన్స్ తరగతుల కోసం ప్రతిరోజు అమీర్పేట్కు తన బైక్పై వెళ్లి వస్తుండేవాడు. శనివారం రాత్రి అమీర్పేట్ నుంచి ఎన్ఎండీసీ మీదుగా మెహిదీపట్నం వస్తుండగా సరోజినిదేవి కంటి ఆస్పత్రి ఎదురుగా ముందు వెళ్తున్న టిప్పర్ను ఓవర్టేక్ చేయబోయాడు. ప్రమాదవశాత్తు బైక్ జారి టిప్పర్ కింద పడ్డాడు.
టిప్పర్ చక్రాలు విశ్వకళ్యాణ్ తలపై నుంచి వెళ్లడంతో తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమా చారం అందుకున్న హుమాయూన్నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీ కి తరలించారు. ఆదివారం ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.