న్యూఢిల్లీ : పెండ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో 21 ఏండ్ల యువతిపై ఆమె బావ యాసిడ్తో దాడి చేసిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. నిందితుడు చాలాకాలంగా మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. పెండ్లి చేసుకుంటానని వెంటపడుతుండటంతో అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. మహిళపై కోపం పెంచుకున్న నిందితుడు ఆమె ముఖం, శరీరంపై యాసిడ్తో దాడి చేశాడు.
మహిళ అరుపులు విన్న స్ధానికులు అక్కడకు రాగా నిందితుడు పరారయ్యాడు. పోలీసులకు సమాచారం అందించడంతో బాధితురాలిని దవాఖానకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలి పరిస్ధితి ప్ర్తస్తుతం నిలకడగా ఉందని, నిందితుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.