హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్ టీయూహెచ్) రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆసాని జయలక్ష్మీని తొలగించాలని కొందరు నాయకులు చేస్తున్న కుట్రలపై చర్యలు తీసుకొని, రాజ్యాంగ విలువలు కాపాడాలని గవర్నర్ శివప్రసాద్ శుక్లాను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర కోరారు. రాజ్యాంగ హోదాలో ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన వర్సిటీ వైస్ చాన్స్లర్పై రాజకీయ పలుకుబడి వినియోగించి ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఆ కుట్రలు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వెనుకబడిన వర్గానికి చెందిన, నిజాయితీ గల అధికారిని పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగితే, అది రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయం, సమాన అవకాశాల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. బీసీ వర్గాలకు చెందిన మహిళ ఉద్యోగుల్లో తీవ్ర నిరుత్సాహం కలిగించే చర్యగా నిలుస్తుందని వివరించారు.