ముంబై : మీ కుమారుడి ఫ్రెండ్ను అని నమ్మబలుకుతూ వృద్ధురాలి నుంచి ఓ వ్యక్తి రూ 71,000 విలువైన గోల్డ్ చైన్ను దొంగిలించిన ఘటన భోసారిలోని గవానే వస్తి ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. మహిళ తన కిరాణా దుకాణంలో ఉండగా ఆమె కుమారుడి ఫ్రెండ్ను అంటూ నిందితుడు చోరీకి తెరలేపాడు.
తన తల్లికి ఇలాంటి నగలు చేయిస్తానని డిజైన్ కోసం చైన్ను తనకు చూపించాలని కోరాడు. ఆమె చైన్ను తీసి ఇవ్వగా దృష్టి మళ్లించి ఫ్రెండ్ బైక్పై ఉడాయించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.