పుణే : కస్టమ్స్ అధికారిణినని నమ్మబలుకుతూ ఓ మహిళ తక్కువ ధరకు గోల్డ్ బార్స్ విక్రయిస్తానని వ్యక్తిని రూ 84 లక్షలకు మోసం చేసిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. బాధితుడిని శివాజీనగర్ ప్రాంతానికి చెందిన 35 ఏండ్ల వ్యక్తిగా గుర్తించారు. నిందితురాలు ఈ ఏడాది సెప్టెంబర్లో తాను కస్టమ్స్ ఆఫీసర్నని చెబుతూ బాధితుడితో పరిచయం పెంచుకుంది. తక్కువ రేటుకే గోల్డ్ బార్స్ విక్రయిస్తానని మభ్యపెట్టి అతడిని నిండా ముంచింది.
తాను నిందితురాలికి రూ 71.60 లక్షలు ఇచ్చానని, ఆన్లైన్ ద్వారా మరో రూ 12.40 లక్షలు ఆమె బ్యాంక్ ఖాతాకు జమ చేశానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. ఏడాది తర్వాత బాధితుడు ఫిర్యాదు చేశాడని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.