లక్నో : కట్నం కోసం అత్తింటి వేధింపులకు మహిళ బలైన ఘటన యూపీలోని షమ్లి జిల్లాలో వెలుగుచూసింది. ఆజాద్ చౌక్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో మహిళకు విషం ఇచ్చి అత్తింటి వారు కడతేర్చడం కలకలరం రేపింది. ఈ కేసులో మహిళ భర్త సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మేలో బాధితురాలు మస్కన్ కశిఫ్ల వివాహం జరిగింది.
తగినంత కట్నం తీసుకురాలేదని పెండ్లయినప్పటి నుంచి కసిఫ్ మస్కన్ను నిత్యం వేధించేవాడని బాధితురాలు కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్తంటి వారు ఆమెకు విషమిచ్చి ఉసురుతీశారని ఆరోపించారు. కసిఫ్తో పాటు అతడి తల్లి ముగ్గురు సోదరులు, సోదరిపై కేసు నమోదు చేశామని పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించామని, కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.