కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను కిరాతకంగా హత్య చేశారు హంతకులు. అవుకు శివారులోని కొత్త కాలువ సమీపంలో నివసిస్తున్న సుమలత దారుణ హత్యకు గురయింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న సుమలత తలపై రోకలిబండతో మోది హత్య చేశారు. ఆమెను హత్య చేయాల్సినంత అవసరం ఎందుకొచ్చింది..?
ఎవరెవరితో ఆమెకు విభేదాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.