అహ్మదాబాద్ : ఐదేండ్లుగా సహజీవనం చేస్తున్న భాగస్వామి స్వీటీ పటేల్ (36)ను సస్పెన్షన్కు గురైన పోలీస్ ఇన్స్పెక్టర్ అజయ్ దేశాయ్ దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఓ విషయంలో జరిగిన ఘర్షణతో స్వీటీని దేశాయ్ హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని దహేజ్ ప్రాంతంలోని అటలి ప్రాంతంలో దగ్ధం చేశాడు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో సగం కాలిన మంగళసూత్రం, ఉంగరం, బ్రేస్లెట్ వంటి ఆభరణాలు, మృతురాలికి చెందిన ఐదు పళ్లను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించి పరిశీలించిన మీదట మాజీ కాప్ దేశాయ్ బండారం బయటపడింది.
అక్కడ లభించిన పుర్రె, స్పైన్, గోళ్లను డీఎన్ఏ పరీక్ష కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఈ కేసులో ఈ ఆధారాలు పోలీసులకు కీలకంగా మారాయి. జూన్ 5న స్వీటీ పటేల్ను హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని దగ్ధం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వదోదర రూరల్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్లో ఇన్స్పెక్టర్గా పనిచేసిన దేశాయ్ తన భాగస్వామి స్వీటీని హత్య చేసిన అనంతరం తన స్నేహితుడు కీర్తిసింహ్ జడేజా సాయంతో అటాలీ ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లి దగ్ధం చేశాడని ఆరోపిస్తున్నారు.