భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కమలానగర్ ప్రాంతంలో 28 ఏండ్ల యువతిని ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాధిత యువతి తన సోదరితో కలిసి శుక్రవారం రాత్రి ఇంటి వెలుపల వాకింగ్ చేస్తుండగా అక్కడికి బైక్పై దూసుకొచ్చిన దుండగుడు వారి వద్ద ఆగి తన ప్రైవేట్ భాగాలను చూపాడు.
నిందితుడి చర్యతో యువతి కేకలు వేయగా అక్కడ నుంచి పారిపోయాడు. యువతి అతడి బైక్ నెంబర్ నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.