భోపాల్ : లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మరిదిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వెలుగుచూసింది. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన తన భర్త శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన సమయంలో మరిది తమ ఇంటికి వచ్చాడని భర్త లేడని చెప్పగా ఆయన వచ్చే వరకూ ఇక్కడే ఉంటానని చెప్పాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆపై తాను నిద్రిస్తున్న గదిలోకి వచ్చి తనను అభ్యంతరకరంగా తాకాడని ఆరోపించారు. తాను సాయం కోసం అరవగా అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొన్నారు. ఆపై నిందితుడిపై సుఖి-సెవానియా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.