పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద లారీ ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన దాడి వెంకమ్మ (70) గోదావరి నది స్నానం చేసి పెద్దపల్లిలో రాజీవ్ రహదారి దాటి బస్ స్టాండ్ వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాఫిక్ సీఐ అనిల్, ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.