ముంబై : మహిళపై లైంగిక దాడి యత్నం విఫలం కావడంతో ఆమెను దారుణంగా హతమార్చిన కిరాతకుడి ఉదంతం ముంబైలోని ఘట్కోపర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 1న ఘట్కోపర్ ప్రాంతంలోని పంత్ నగర్లోని బాధిత మహిళ(55) ఇంటికి వెళ్లిన నిందితుడు సాగర్ యాదవ్ (55) ఆమె కాళ్లు, చేతులను కట్టిపడేసి లైంగిక దాడికి ప్రయత్నించాడు.
బాధిత మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు ఆగ్రహంతో ఆమె తలపై రాళ్లతో కొట్టి హత్య చేశాడు. వృత్తిరీత్యా చెత్త ఏరుకునే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు సాగర్ యాదవ్ వాశిలో ఓ మహిళ హత్య కేసులో 2016లో అరెస్టయి ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. ఇక తాజా ఘటనలో నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.