బెంగళూర్ : కర్నాటక ప్రభుత్వ ఉద్యోగిని దారుణ హత్య (Stabbed To Death) రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బెంగళూర్లోని మహిళ నివాసంలో దుండగులు ఆమెను కత్తితో విచక్షణా రహితంగా దాడిచేయడంతో మరణించిందని పోలీసులు తెలిపారు.
మైన్స్, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రతిమ (37) నివాసంలోకి చొరబడిన దుండగులు ఆమెపై కత్తితో దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో భర్త తన స్వస్ధలం తీర్ధహళ్లి వెళ్లడంతో ప్రతిమ ఒక్కరే ఇంటిలో ఉన్నారు. ప్రతిమ సోదరుడు శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆమెను తన ఇంటి వద్ద విడిచిపెట్టి వెళ్లాడు.
ఆపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ప్రతిమ రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి చేసిన వారు ఆమెకు తెలిసిన వారే అయిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read More :
Telangana | తెలంగాణలో కాంగ్రెస్కు ఓటమే.. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ పక్కా.. తేల్చిచెప్పిన ఇండియా టీవీ