పెనుబల్లి: మండలపరిధిలోని వీఎం.బంజరుకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వీఎం. బంజరుకు చెందిన వంగా బాలమురళీకృష్ణ-వనజ భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున వనజ మృతి చెందింది.
దీంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న వనజ తల్లిదండ్రులు తమ కూతురు మృతి పట్ల అనుమానాలున్నాయని, అల్లుడు బాలమురళీకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు వీఎం.బంజర ఎస్ఐ తోట నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.