న్యూఢిల్లీ : కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్లు (Cyber Fraud) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. రోజుకో స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. లేటెస్ట్గా కోయంబత్తూర్కు చెందిన మహిళకు పార్ట్టైం జాబ్ ఆఫర్ చేసిన నేరగాళ్లు ఆమెకు ఏకంగా రూ. 16 లక్షలకు టోకరా వేశారు. బాధితురాలిని తొలుత మెసేజింగ్ యాప్తో కాంటాక్ట్ చేసిన స్కామర్లు ఆపై అధిక రిటన్స్ వస్తాయనే ఆశచూపి పెట్టుబడి పెట్టాలని మభ్యపెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దీనా సుధ (33) అనే మహిళను టెలిగ్రాం యాప్ ద్వారా ఈ ఏడాది ఆగస్ట్లో ఓ వ్యక్తి సంప్రదించాడు. ఆన్లైన్లో హోటల్స్కు రేటింగ్స్ ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించవచ్చని నమ్మబలుకుతూ పార్ట్టైం జాబ్ ఆఫర్ చేశాడు. ప్రతి రేటింగ్కు మెరుగైన రిటన్స్ అందుతాయని మభ్యపెట్టాడు. ఇది సరైన ఆఫరేనని నమ్మిన మహిళ పార్ట్టైం జాబ్ చేసేందుకు అంగీకరించింది.
హోటల్స్కు రేటింగ్స్ ఇచ్చినందుకు తొలుత ఆమెకు స్కామర్లు కొంత డబ్బు ముట్టచెప్పారు. అయితే అధిక లాభాలు ఆర్జించేందుకు ఇన్వెస్ట్ చేయాలని నిందితులు కోరడంతో ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 11 మధ్య ఆమె ఏకంగా రూ.16 లక్షల వరకూ వివిధ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసింది. ఆపై తన సొమ్మును విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా విఫలం కావడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :