న్యూఢిల్లీ : ముంబై నుంచి గోవా వెళుతున్న ఓడలో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారుల దాడిలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్తో పాటు పట్టుబడిన వారిలో యువతి మున్మున్ ధమెచా ఉండటంతో ఆమెకు సంబంధించిన వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఓడలో భారీగా డ్రగ్స్ను ఎన్సీబీ అధికారులు సీజ్ చేశారు. ఆర్యన్ ఖాన్తో పాటు అరెస్టయిన మున్మున్ ధమెచా (39) వ్యాపార కుటుంబానికి చెందిందని, ఈమె ఫ్యాషన్ మోడల్గా పనిచేస్తున్నట్టు సమాచారం.
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా ఆమె స్వస్ధలం. మున్మున్ తల్లి గత ఏడాది మరణించగా అంతకుముందు తండ్రి అమిత్ కుమార్ ధమేచను కోల్పోయింది. ఆమె సోదరుడు ప్రిన్స్ ధమేచ ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఆరేండ్ల కిందట మున్మున్ తన సోదరుడితో కలిసి ఢిల్లీకి వెళ్లింది. ఇన్స్టాగ్రాంలో ఆమెకు 10,200 మంది ఫోలోయర్లు ఉండగా అక్షయ్ కుమార్, విక్కీ కౌశల్ వంటి పలు సెలబ్రిటీలను ఆమె ఫాలో అవుతున్నారు.
ఇది కూడా చూడండి