CISCE Results |న్యూఢిల్లీ, మే 6: సీఐఎస్సీఈ 10, 12 తరగతుల బోర్డ్ పరీక్షల్లో బాలికలు మరోసారి సత్తా చాటారు. పదో తరగతిలో 99.65 శాతం మంది, 12వ తరగతలో 98.12 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలురు 10లో 99.13 శాతం, 12వ తరగతిలో 97.53శాతం ఉ త్తీర్ణత పొందారు.
బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాల్ని సీఐఎస్సీఈ సోమవారం విడుదల చేసిం ది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందని తెలిపింది. విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తున్నదని మెరిట్ జాబితాను విడుదల చేయ టం ఈ ఏడాది నుంచి నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నది. పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్లో 100 శాతం ఉత్తీర్ణతతో ఇండోనేషియా, సింగపూర్, దుబాయ్లోని స్కూల్స్ అత్యుత్తమ పనితీరును కనబర్చాయి.