దోమ : గుండెపోటుతో పశ్చిమ బెంగాల్ కార్మికుడు మృతి చెందిన ఘటన దోమ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో పని చేస్తున్న పశ్చిమ బెంగాల్ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడని పేర్కొన్నారు. కార్మికుడు లక్ష్మణ్ గోష్ (44)కు శనివారం గుండె పోటు రావడంతో కార్మికులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతు మృతి చెందాడు. తోటి కార్మికుడు మురారీగోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.