కోల్కతా: పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దులో 25 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ అసన్సోల్లోని దుర్గాపూర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం సరిహద్దు ప్రాంతంలో నాకా బందీ నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా 25 గన్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి కుల్తి నివాసి యాష్ మొహమ్మద్ను అరెస్ట్ చేశారు. పోలీస్ అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 25 తుపాకులను మీడియా ముందు ప్రదర్శించారు. వీటి అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.