వేములవాడ : చేపల వేట ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన వేములవాడ మండలం సంకేపల్లి వద్ద గల మిడ్ మానేరు బ్యాక్ వాటర్లో చేటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ముదిరాజ్ వీధికి చెందిన బైరి దరి అనే యువకుడు మిడ్ మానేరు బ్యాక్ వాటర్లో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో చేపల వల కాళ్లకు చుట్టుకొని నీటిలో ఊపిరాడాక మరణించాడు.