రాయపర్తి : మండలంలోని పానీష్ తండా శివారులోని కొత్త తండాకు చెందిన విద్యార్థిని బానోతు అనూష (15) వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై బండారి రాజు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. కొత్తతండాకు చెందిన బానోతు వెంకన్న కుమార్తె అనూష కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు. శనివారం రాత్రి కడుపు నొప్పి తీవ్రం కావడంతో భరించలేక ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108లో చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు తెలిపారు. ఈ మెరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.