వికారాబాద్ : రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం బుద్దరం గ్రామానికి చెందిన బేగరి లక్ష్మణ్(30) కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. 6 సంవత్సరాల క్రితం అక్కడి నుంచి వికారాబాద్ పట్టణానికి వచ్చి అక్కడక్కడ కూలీ పనులు చేసేవాడు. అతిగా మద్యం సేవించే అలవాటు ఉంది.
శుక్రవారం కాలకృత్యాలు తీర్చుకోడానికి వికారాబాద్ – సదాశివపేట రోడ్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలు దాటుతుండగా తాగిన మైకంలో రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. అదే సమయంలో గూడ్స్ రైలు వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.