వికారాబాద్ : ఏటీఎంలో దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తి శనివారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ రైల్వేస్టేషన్ ముందు ఎస్బీఐ ఏటీఎంలో శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి యత్నించారు. ఈ విషయాన్ని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఏటీఎంను పరిశీలించగా ఎలాంటి నష్టం జరుగలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో సంఘటన స్థల పరిసరాలను పరిశీలించి వ్యక్తిని గుర్తించారు. ఈ సంఘటనకు పాల్పడిన దాసరి కొట్రి మల్లేష్ అనే వ్యక్తిగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.