వికారాబాద్ : బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల మండల కోకట్ గ్రామానికి చెందిన కోరెడ్డి చంద్రశేఖర్రెడ్డి (40) లారీ డ్రైవర్గా పని చేసేవాడు. వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామానికి చెందిన లక్ష్మీతో 20సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కూతురు. కాగా చంద్రశేఖర్రెడ్డి మద్యానికి అలవాటై తల్లి, భార్య లక్ష్మీని ఎప్పుడు కొట్టేవాడు. 10సంవత్సరాల క్రితం భార్య లక్ష్మీ బాధ బరించలేక తన కూతురుని తీసుకొని తల్లిగారి ఇంటికి వచ్చింది. చంద్రశేఖర్ అప్పటి నుంచి 10, 15 రోజులకోకసారి పులుమద్ది గ్రామానికి వచ్చి వెళ్లేవాడు.
ఈ నెల 15న దసరా ఉండటంతో టీఎస్ 09ఈఎల్2847 నంబర్ గల బైక్పై పులుమద్దికి వస్తుండగా నవాబుపేట మండలం మహ్మదాన్పల్లి గ్రామం మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని వికారాబాద్ ఏరియా దవాఖాన మార్చురిలో ఉంచగా చంద్రశేఖర్గా గుర్తించారు. నా భర్త మరణం పట్ల తమకు ఎలాంటి అనుమానం లేదని భార్య లక్ష్మీ నవాబుపేట పోలీసులకు తెలిపింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.