లక్నో : ఇంటికి తిరిగి రావాలని ప్రాధేయపడిన భర్త నాలుకను భార్య కొరికేసింది. నాలుక పూర్తిగా తెగిపోవడంతో బాధిత వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఠాకూర్గంజ్లో ఘోరం జరిగింది.
ఠాకూర్గంజ్కు చెందిన మున్నా, సల్మా దంపతులు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం సల్మా తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. భర్తతో గొడవ కారణంగా, ఆమె తిరిగి అత్తగారింటికి చేరుకోలేదు. ఈ క్రమంలో మున్నానే శుక్రవారం రోజు అత్తగారింటికి వెళ్లాడు. తిరిగి తన వెంట రావాలని సల్మాను మున్నా కోరాడు.
ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక కోపంతో ఊగిపోయిన భార్య, తన భర్త నాలుకను కొరికేసింది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సల్మాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.