Crime GPT : నేరగాళ్లను వేగంగా పట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్రస్తుతం క్రైమ్ జీపీటీని వాడుతున్నారు. స్టేక్ టెక్నాలజీస్ యూపీ ప్రభుత్వం, స్పెషల్ టాస్క్ఫోర్స్ సహకారంతో ఈ న్యూ టూల్ను క్రియేట్ చేసింది. నేరగాళ్ల డిజిటల్ డేటా బేస్ను తనిఖీ చేస్తూ క్రైమ్ జీపీటీ పనిచేస్తుంది. రాతపూర్వక, స్పోకెన్ క్వశ్చన్స్ ద్వారా నిర్ధిష్ట వ్యక్తుల గురించిన సమాచారం ఇది వేగంగా రాబడుతుంది.
ఫేస్ రికగ్నైజేషన్, వాయిస్, క్రిమినల్ గ్యాంగ్ల విశ్లేషణ వంటి ఫీచర్లను క్రైమ్ జీపీటీ కలిగిఉంది. స్టేక్ టెక్నాలజీస్ సహ వ్యవస్ధాపకుడు, సీఈవో అతుల్ రాయ్ ఈ టూల్ పనితీరును వివరించారు. సాంకేతికతతో భద్రతను కట్టుదిట్టం చేయాలనే తమ కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా క్రైమ్ జీపీటీని అబివృద్ధి చేశామని రాయ్ తెలిపారు.
క్రైమ్ జీపీటీ ద్వారా పోలీసులు నేరగాళ్ల గురించి సరైన సమాచారాన్ని రాబట్టవచ్చని చెప్పారు. దీంతో వారిని పట్టుకోవడం సులువవుతుంది. భద్రతా విభాగంలో అన్ని సేవలు అందించేందుకు యూపీ ప్రభుత్వంతో కలిసిపనిచేస్తామని అతుల్ రాయ్ వెల్లడించారు.
Read More :
Tamilisai | తమిళిసై ఎక్కడ్నుంచి పోటీ..? తూత్తుకుడినా..! పుదుచ్చేరినా..!!