కుమ్రం భీం ఆసిఫాబాద్ : కాగజ్నగర్ మండల పరిధిలోని కడంబ వద్ద సోమవారం రాత్రి ఘోరం జరిగింది. బైక్పై వెళ్తున్న దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. భయపడ్డ దంపతులు బైక్ను రోడ్డుపైనే వదిలేసి.. గాయాలతోనే అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రోడ్డుపై పడి ఉన్న బైక్ను గమనించిన వాహనదారులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. బైక్కు కొంచెం దూరంలో ఉన్న దంపతులను పోలీసులు గుర్తించారు. అనంతరం బాధిత దంపతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.