ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించిన సంఘటన ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఖమ్మం నగరం కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి సమీపంలో ఓ వాహనం ఢీ కొనడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుని ద్విచక్ర వాహనం నెం-ఏపీ20 జే 7369. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, మృతుని గురించి తెలిస్తే తమను సంప్రదించాలని త్రీ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.